Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నో ఎగ్జిట్ పోల్స్: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 19 ఉదయం 7.00 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల మధ్య వచ్చే లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లు వేసే సమయంలో ఎగ్జిట్ పోల్స్‌ను నిర్వహించడం, ప్రచురించడం లేదా ప్రచారం చేయడంపై నిషేధం విధిస్తూ భారత ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది .

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం.. పోల్ ముగింపు కోసం నిర్ణయించిన సమయంతో 48 గంటల వ్యవధిలో ఎలాంటి ఒపీనియన్ పోల్ లేదా మరేదైనా ఇతర పోల్ సర్వే ఫలితాలతో సహా ఏదైనా ఎన్నికల విషయాలను ప్రదర్శించడం, ఏ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించడం నిషేధం అని తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది.

No exit poll from 7 am on April 19 to 6 30 pm on June 1 Election commission

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు విడివిడిగా ఉపఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోపాటు ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నాయి.

కాగా, 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఏప్రిల్ 19న ఎన్నికలు ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. 1వ దశ పోలింగ్ ఏప్రిల్ 19న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 26, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న 5వ దశ, మే 25న 6వ దశ, జూన్ 1న చివరి, 7వ దశ ఎన్నికలు జరుగుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+