సాఫీగా, అలైన్మెంట్ మార్పులే: మెట్రో ప్రాజెక్ట్పై ఎండీ
హైదరాబాద్: మెట్రో రైలు పనులకు ఎలాంటి ఇబ్బంది లేదని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం తెలిపారు. మెట్రో పనులు సాఫీగానే సాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అలైన్మెంట్ మార్పు పైన ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని తెలిపారు.
ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చాక ఎల్ అండ్ టీకి చెబుతాని తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు.
కాగా, రెండు రోజులుగా మెట్రో రైలు అంశంపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మెట్రో రైలు పనులు మీరే చేసుకోండని ఎల్ అండ్ టీ లేఖ రాసినట్లుగా కథనాలు వచ్చాయి. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రులు, ఎల్ అండ్ టీ అధికారులు, మెట్రై రైలు ఎండీ తదితరులు వెంటనే స్పందించారు. కథనాలు ఉద్దేశ్యపూర్వకమైనవని కొట్టిపారేశారు.