ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ కాదా ? బీజేపీని వాడుకుని ఎన్టీఆర్ ఫ్యామిలీ హైజాక్ !
ఏపీలో ఎన్టీఆర్ వారసులెవరు ? ఆయనకు వెన్నుపోటు పొడిచారని చెబుతున్న అల్లుడు చంద్రబాబు, ఆయనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులా ? లేక ఆయనతో తుది కంటా ఉన్న లక్ష్మీపార్వతా అన్న చర్చకు దాదాపు తెరపడే సమయం వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతికి కాస్తో కూస్తో గుర్తింపు దక్కినా తాజాగా ఆయన శతజయంతి కార్యక్రమాలతో పాటు కేంద్రం నిర్వహించిన స్మారక నాణెం విడుదల కార్యక్రమానికీ ఆమెకు ఆహ్వానం దక్కలేదు. దీంతో ఎన్టీఆర్ కుటుంబం దశాబ్దాలుగా సాగుతున్న పోరులో లక్ష్మీపార్వతిని విజయవంతంగా వెనక్కి నెట్టేసినట్లయింది.
ఎన్టీఆర్ మరణానికి ముందే ఆయన కుటుంబ సభ్యుల్ని వదిలేసి లక్ష్మీపార్వతి దగ్గరికి వెళ్లిపోయారు. ఇది తట్టుకోలేక ఆయన కుటుంబం ఎన్టీఆర్ నుంచి అధికారం లాగేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వీరికే మద్దతివ్వడంతో ఎన్టీఆర్ ఒంటరయ్యారు. చివరకు ఆత్మక్షోభతోనే చనిపోయారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వారసత్వం గురించిన చర్చ వచ్చినప్పుడల్లా తాను ఉన్నానంటూ ముందుకొచ్చిన లక్ష్మీపార్వతిని రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోలేదు. కానీ ఏపీ విభజన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమెను పార్టీలోకి తీసుకోవడంతో పాటు ఎన్టీఆర్ అభిమానుల మద్దతు పొందే ప్రయత్నం చేసింది.

కానీ ఎన్టీఆర్ వారసత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే లక్ష్యంతో బీజేపీ అప్పటికే పార్టీలో ఉన్న ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ అధ్యక్షురాలిగా ప్రకటించింది. దీంతో సగం సమీకరణాలు మారిపోయాయి. తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబానికి ఆహ్వానం పంపి, లక్ష్మీపార్వతిని పక్కనబెట్టేశారో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశం కూడా స్పష్టమైంది. ఇది అర్ధం చేసుకునే వైసీపీ సైలెంట్ గా ఉండిపోయింది. ఇంకా చెప్పాలంటే దీనికి కారణమైన పురందేశ్వరిని వదిలిపెట్టి చంద్రబాబును టార్గెట్ చేసింది.
ఇన్నాళ్లూ ఎన్టీఆర్ వారసురాలు లక్ష్మీపార్వతే అనుకుంటున్న కొందరికి ఇప్పుడు తాజా పరిణామాలతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రేపు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించినా దాన్ని ఆయన కుటుంబమే తీసుకుంటుందే తప్ప లక్ష్మీపార్వతిని ఆహ్వానించే అవకాశాలు లేవు. దీంతో ఇకపై ఆమె లక్ష్మీస్ ఎన్టీఆర్ కాదని తేలిపోతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎన్టీఆర్ కుటుంబం బీజేపీ సాయంతో గతంలో తాము పొగొట్టుకున్న దాన్ని తిరిగి పొందినట్లు అర్ధమవుతోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications