చంద్రబాబుపై గండ్ర, వినలేదని పురంధేశ్వరిపై ద్రోణంరాజు
వరంగల్/విశాఖ: కాంగ్రెసు పార్టీని తిడితే ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని నారా చంద్రబాబు నాయుడు అనుకోవడం అమాయకత్వమని మాజీ ప్రభుత్వ చీఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి గురువారం అన్నారు. ఏ పార్టీలతో పొత్తుల కోసం కాంగ్రెసు పార్టీ వెంపర్లాడదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు వద్దని తమ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నారన్నారు.

పురంధేశ్వరి చేరికపై ద్రోణంరాజు
మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరితో కాంగ్రెస్ నేతలు ద్రోణంరాజు శ్రీనివాస్, మళ్ల విజయ్ ప్రసాద్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీని వీడవద్దని పురందేశ్వరిని నేతలు కోరగా, ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, వెనక్కి రాలేమని స్పష్టం చేశారు.
పురంధేశ్వరితో భేటీ అనంతరం ద్రోణంరాజు మాట్లాడారు. పురంధేశ్వరి దంపతులు పార్టీని వీడటం బాధాకరమన్నారు. వారి నిర్ణయం తమను బాధించిందన్నారు. విభజనలో బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల పాపం కూడా ఉందని, అలాంటి పార్టీలలో ఆమె చేరాలనుకోవడం సరికాదన్నారు. కాంగ్రెసు పార్టీలోనే కొనసాగాలని తాము సూచిస్తే ఆమె తిరస్కరించారన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications