పవన్ కల్యాణ్ దెబ్బతో సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అధికారుల సర్వే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో సరస్వతి పవర్ సంస్థలో అటవి శాఖ అధికారులు సర్వే చేయడం మొదలుపెట్టారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు శనివారం దాచేపల్లి, మాచవరం మండలంలోని సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములలో దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో అటవి శాఖ అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు.
సరస్వతి పవర్ సంస్థ భూముల వ్యవహారంలో సర్వే చెయ్యాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యావరణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీసీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అటవిశాఖ అధికారులు శనివారం రంగంలోకి దిగారు. సరస్వతి పవర్ సంస్థకు ఉన్న సుమారు 1,515 ఎకరాల భూముల్లో వాగులు, వంకలు, కొండ భూములు, ప్రకృతి సంపద భూములు ఏమైనా ఉన్నాయేమో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని పవన్ కల్యాణ్ అటవీశాఖ, పర్యావరణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సరస్వతి పవర్ సంస్థ భూముల్లో ప్రకృతి సంపద, ప్రభుత్వ భూములు ఉన్నాయా అంటూ అటవీశాఖ అధికారుల క్షుణ్ణంగా సర్వే మొదలుపెట్టారు. సరస్వతి పవర్ సంస్థ భూముల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండలు ఉంటే ఆ సంస్థకి పర్యావరణ శాఖ ఎలా అనుమతులు ఇచ్చింది, ఆ శాఖ అధికారుల మీద ఎవరైనా ఒత్తిడి తెచ్చారా ? అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరాలు సేకరిస్తుంది.
మొత్తం మీద సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అటవీశాఖ అధికారులు సర్వే చేయడం హాట్ టాపిక్ అయింది. సరస్వతి పవర్ సంస్థ భూముల్లో ప్రకృతి సంపద, ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారు ? అనే విషయంలో చర్చ మొదలైయ్యింది. అటవి శాఖ అధికారులు నివేదిక ఎప్పుడు ఇస్తారా ? అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications