కిటికీల్లోంచి దూకి బయటపడ్డారు: హైవేపై కాలి బూడిదైన బస్సు(పిక్చర్స్)
ప్రకాశం: జిల్లాలోని గుడ్లూరు మండలంలోని మోచర్ల సమీపంలో బుధవారం పెనుప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి చెన్నైకి 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు జాతీయరహదారిపై చెన్నై వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
దీంతో లారీ రహదారి పక్కకు బోల్తా పడగా.. బస్సు కుడివైపు రహదారి డివైడర్ను రాసుకుంటూ 50 మీటర్లు ముందుకు రావడంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలు అంటుకున్నాయి.
వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. మంటల్లో చిక్కికున్న బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సు అతి వేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఏదేమైనా ప్రయాణికలుందరూ స్వల్ప గాయాలతో బయటపడంతో ఊపిరిపీల్చుకున్నారు.
మంటల్లో బస్సు
ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు మండలంలోని మోచర్ల సమీపంలో బుధవారం పెనుప్రమాదం తప్పింది.
మంటల్లో బస్సు
బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి చెన్నైకి 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు జాతీయరహదారిపై చెన్నై వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
మంటల్లో బస్సు
దీంతో లారీ రహదారి పక్కకు బోల్తా పడగా.. బస్సు కుడివైపు రహదారి డివైడర్ను రాసుకుంటూ 50 మీటర్లు ముందుకు రావడంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలు అంటుకున్నాయి.
రహదారి పక్కన పడిపోయిన లారీ
వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. మంటల్లో చిక్కికున్న బస్సు పూర్తిగా కాలిపోయింది.
కాలి బూడిదైన బస్సు
బస్సు అతి వేగంగా వెళ్తుండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
కాలిబూడిదైన బస్సు
ఏదేమైనా ప్రయాణికలుందరూ స్వల్ప గాయాలతో బయటపడంతో ఊపిరిపీల్చుకున్నారు.