మెదక్లో పోటీ, గ్రేటర్లో తడాఖా చూపిస్తాం: కిషన్ రెడ్డి
హైదరాబాద్: మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం బిజెపి రాష్ట్రస్థాయి సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశంలో బిజెపి ఓటమిపై వాడివేడిగా చర్చించారు.
సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, తమ తడాఖా చూపిస్తామని కిషన్ రెడ్డి అన్నారు.
జిహెచ్ఎంసి బ్రాండ్ ఇమేజ్ పరిరక్షణ బిజెపికే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఎలాంటి షరతులు పెట్టరాదని, అవసరమైతే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.
ఏపి ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు నియమితులయ్యారు. కంభంపాటి రామ్మోహన్ రావును ఏపి ప్రతినిధిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.