రామోజీరావుకు పద్మవిభూషణ్, సానియా, సైనాలకు పద్మభూషణ్ అవార్డులు, బాబు, కెసిఆర్ హర్షం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను సోమవారం ప్రకటించింది. ప్రముఖ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావులకు పద్మవిభూషణ్ అవార్డు వరించింది. పత్రికా రంగంలో విశేష కృషి చేసినందుకు రామోజీ రావుకి ఈ అవార్డు దక్కింది.
వీరితోపాటు నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి, ధీరూబాయ్ అంబానీ(మరణానంతరం), సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, శ్రీశ్రీ రవిశంకర్, జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, విశ్వనాథన్ శాంత, డా. వాసుదేవ్ కులకుంటె ఆత్రే, అవినాశ్ దీక్షిత్(భారత సంతతి) అవార్డు వరించింది. ఈ ఏడాది పది మందికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది.

పద్మభూషణ్:
సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
సానియా మీర్జా, టెన్నిస్ క్రీడాకారిణి
యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్
ఉదిత్ నారాయణన్
వినోద్ రాయ్(మాజీ కాగ్)
హేస్నమ్ కన్హయిలాల్
ఎన్ఎస్ రామనుజ తాతాచార్య
బరిందర్ సింగ్ హమ్దర్ద్
డి. నాగేశ్వర్ రెడ్డి
స్వామి తేజోమయానంద
రాబర్ట్ డి బ్లాక్విల్(భారత యూఎస్ మాజీ అంబాసిడర్)
ఇందూ జైన్
రవిచంద్ర భార్గవ
రాం వి సుతార్
హఫీజ్ కాంట్రాక్టర్
వెంకట్ రామారావు ఆళ్ల
బ్రిజేందర్ సింగ్
పద్మ శ్రీ:
ఉజ్వల్ నికమ్(సీనియర్ లాయర్)
అజయ్ దేవగన్, బాలీవుడ్ నటుడు
ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటి
ఎస్ఎస్ రాజమౌళి(బాహుబలి దర్శకుడు)
మాళిని అవాస్థి, భోజ్పురి గాయని
ప్రెడ్రగ్ కె నికిక్(యోగా-సైబీరియా)
హూయి లాన్ ఝాంగ్(యోగా-చైనా)
చంద్రబాబు, కెసిఆర్ హర్షం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పద్మవిభూషణ్కు ఎంపికకావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తంచేశారు. తెలుగు పత్రికా రంగాన్ని రామోజీరావు ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. పత్రికారంగం, ఎలక్ట్రానిక్ మీడియాలో చరిత్ర సృష్టించారన్నారు.
పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలందించిన రామోజీరావుకు పద్మవిభూషణ్ ప్రకటించడం సముచితమన్నారు. వైద్యరంగంలో డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి, క్రీడా రంగంలో సానియా మీర్జా, సైనా నెహ్వాల్లకు పద్మభూషణ్ దక్కడం హర్షణీయమన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications