జగన్ జైల్లో ఉన్నా,కిరణ్ పిచ్చోడు: ఏకిపారేసిన పాల్వాయి

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాష్ట్రాన్ని, కేంద్రాన్ని, బ్యాంకులను నిండా ముంచారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలు వరదలు, వర్షాలతో అల్లాడుతుండే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.
వైయస్ జగన్ను సీమాంధ్రలో అక్కడి కాంగ్రెసు పార్టీ సమర్థవంతంగా అడ్డుకోనందునే కాంగ్రెసు పార్టీకి స్థానం లేకుండా పోయిందన్నారు. విభజన ప్రకటనకు ముందే కాంగ్రెసు పార్టీ అక్కడ జీరో అయిందన్నారు. ముఖ్యమంత్రి పిచ్చోడని విమర్శలు గుప్పించారు.
విభజనపై కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఆయన ఎలా లేఖ రాస్తారని ప్రశ్నించారు. సిడబ్ల్యూసి నిర్ణయాని కంటే ముందు కిరణ్ తాను సమైక్యవాదిని అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఇప్పుడు ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు.
తిన్నింటివాసాలు లెక్కబెట్టడమే: పొన్నం
సోనియాను జగన్ విమర్శిస్తున్నా సీమాంధ్ర కాంగ్రెసు నేతలు పెదవి విప్పక పోవడం తిన్నింటి వాసాలు లెక్కబెట్టడమేనని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ బి ఫాం ఇవ్వకుంటే ఎంపీలు ఎలా గెలిచే వారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి లగడపాటి చంచాగిరి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications