జగన్ రద్దుల రెడ్డి..ఆయన జైలుకు వెళ్తే సీఎం కావాలని ఆశపడేది ఆ ముగ్గురే : పంచుమర్తి అనూరాధ
వైసీపీ సర్కార్ పై, వైసీపీ నేతల తీరుపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ పంచ్ లు వేశారు. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే సీఎం కావాలని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, రోజా ఆశపడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శలు చేశారు . కావాలనే వీరంతామాజీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు .
సీఎం పదవి కోసమే వారు చంద్రబాబును దూషిస్తున్నారని పేర్కొన్న అనూరాధ ప్రజల ఆస్తులను దోపిడీ చేసిన కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ని ఏమనాలని ఆమె ప్రశ్నించారు.ఇక అంతే కాదు వైసీపీలోనే జగన్ జైలుకు వెళ్తే తాము సీఎం కావచ్చని ఎదురు చూస్తున్న నేతలు ఉన్నారని పేర్కొన్నారు. ఇక కన్నాబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన అనూరాధ పైరవీల కోసమే సచివాలయం అంటూ మంత్రి కన్నబాబు చీప్గా మాట్లాడుతున్నారని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Smt Panchumarthi Anurdha Addressing the Media about The Andhra Pradesh Assembly Issues - Live from NTR Bhavan, Amaravati. #APWithAmaravati #SpreadDevelopmentNotHate #SaveAmaravati https://t.co/1qBc09PmlY
— Telugu Desam Party (@JaiTDP) January 28, 2020

మండలిలో 20మందికి పైగా బడుగు, బలహీనవర్గాల వారే ఉన్నారని, బీసీలను అభివృద్ధి చేస్తామని చెప్పి... వైసీపీ వారి గొంతు కోస్తోందని విమర్శించారు.సీఎం జగన్ రద్దుల రెడ్డిగా చరిత్రలో నిలిచిపోతారని ఆమె వ్యాఖ్యానించారు అసెంబ్లీ సాక్షిగా 5కోట్ల మంది ప్రజలను మోసం చేశారని ఆమె విమర్శించారు. మండలి రద్దుపై సీఎం జగన్ పునఃసమీక్షించి, వెనక్కి తీసుకోవాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.
-
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications