శ్రీవారిని దర్శించుకోకుండానే వెనక్కి పరిపూర్ణానంద!
చిత్తూరు: కాకినాడ శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. ఆయన వకుళామాత ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వకుళామాత ఆలయాన్ని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. తాను తిరుమల శ్రీవారిని దర్శించుకొని రెండున్నరేళ్లయిందన్నారు. వకుళామాత ఆలయం పూర్తయ్యాకే తాను శ్రీవారిని దర్శించుకుంటానని చెప్పారు.
ఘనంగా పుష్కరాలు: యనమల
2015లో తాము గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వేరుగా చెప్పారు. పుష్కరాల నిర్వహణకు సబ్ కమిటీని వేస్తామని తెలిపారు.

తుంగభద్రకు కొనసాగుతున్న వరద ఉధృతి
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1626 అడుగులకు చేరింది. తుంగభద్ర డ్యాం ఇన్ఫ్లో 64వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో దిగువ కాల్వకు 750 క్యూసెక్కులు, ఎగువ కాల్వకు 2789 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications