జనసేన టు వైసిపి: రాజధాని విషయంలో చంద్రబాబు ఏకాకి!
గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటరివాడయ్యారని సిపిఎం సిఆర్డీఏ విభాగం కన్వీనర్ సిహెచ్ బాబూరావు పేర్కొన్నారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ సోమవారం ఉండవల్లి సిఆర్డీఏ కార్యాలయాన్ని రైతులతో కలిసి ముట్టడించారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ సమీకరించిన భూమిలో రైతులకు పరిహారంగా ఇస్తామన్న భూమి ఎక్కడో స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వంలోని కొందరు బినామీ పేర్లతో రాజధానిలో భూములు కొనుగోలు చేసి నల్లడబ్బుని, తెల్లడబ్బుగా మారుస్తున్నారన్నారు.
భూసేకరణ విధానాన్ని బిజెపి, టిడిపి మినహా అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. పంటలు పండే భూములను సేకరించి వాటిని బీడు పెట్టొద్దని, రైతుల భూములను కాపాడాలన్నారు.

మరో నాయకుడు రామారావు మాట్లాడుతూ... ప్రభుత్వం చెబుతున్న శాటిలైట్ లెక్కల సమాచారం తప్పుల తడకగా ఉందని, ఇప్పటి వరకూ సమీకరించిన 33వేల ఎకరాల భూమి చాలదన్నట్లు, సేకరణ పేరుతో పేదల భూమలు తీసుకోవటం ఎవరికోసమో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, రాత్రివేళల్లో మంత్రులు రాజధాని గ్రామాల్లో దొంగల్లాగా తిరుగుతూ స్థానిక టిడిపి కార్యకర్తల ద్వారా రైతులకు మాయమాటలు చెప్పి భూసమీకరణకు, సేకరణకు ఒప్పించుకునేందుకు ప్రయత్నాలు చేయటం, మీడియా ముందు అంతా బావుందని చెప్పటం సరికాదని ఇంకొందరు చెప్పారు.
ఇదిలా ఉండగా, రాజధాని కోసం బలవంతపు భూసేకరణను టిడిపి మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విపక్షాలు వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బిజెపిలో కూడా పలువురు నేతలు బలవంతపు భూసేకరణ వద్దని చెబుతున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !! -
విడుదల వేళ.. ఉస్తాద్ షాకింగ్ డెసిషన్ -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications