చంద్రబాబుకు రాజధాని షాకేనా: పవన్ కళ్యాణ్ చూస్తున్నారు?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంపై మౌనంగా లేరని తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణ పైన ఆయన మానిటరింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.
రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం బలవంతంగా భూమిని సేకరిస్తే తాను రైతుల పక్షాన నిలబడతానని, అవసరమైతే రోడ్డెక్కుతానని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం అతను రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు హామీ ఇచ్చారు.

ఆ తర్వాత కూడా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల మీద భూసేకరణ చట్టం ప్రయోగిస్తే నేను రైతుల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు.
అయితే, పవన్ కళ్యాణ్ ఆ అంశాలను అంతటితో వదిలేయలేదని, వాటిపై సమీక్షిస్తున్నారని తెలుస్తోంది. బలవంతంగా భూమిని సేకరిస్తే ఏం చేయాలనే దాని పైన ఆయన ఆలోచిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక రైతులు కూడా పవన్ కళ్యాణ్ పైన ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు.
-
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications