పవన్ చెర నుంచి 55 రోజుల తర్వాత విముక్తి...!
ఏపీలో రేషన్ బియ్యం పోర్టుల నుంచి అక్రమ రవాణా వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. అనంతరం అప్పటికే అధికారులు ఆపిన స్టెల్లా ఎల్ 1 షిప్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి కస్టమ్స్ అధికారులు 55 రోజుల విరామం తర్వాత ఈ విదేశీ నౌక కాకినాడ పోర్టును విడిచి వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుందన్న కారణంతో పవన్ కళ్యాణ్ నవంబర్ లో స్టెల్లా ఎల్ 1 నౌకను సీజ్ చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి స్టెల్లా ఎల్ 1 నౌక కాకినాడ పోర్టులోనే ఉండిపోయింది. అయితే ఇలా సముద్ర జలాల్లో ఉన్న విదేశీ నౌకను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేలడంతో దీన్ని ఏదో ఒక రోజు వదిలేయక తప్పని పరిస్ధితి. కానీ 55 రోజుల తర్వాతే దీన్ని విడుదల చేయాల్సి వస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీజ్ చేయాలనే ఆదేశాలు ఇచ్చాక స్టెల్లా ఎల్ 1 నౌక ను అంత సులువుగా వదిలేసేందుకు అధికారులు ఇష్టపడలేదు. అందులో రేషన్ బియ్యం తనిఖీ పేరుతో, వాతావరణం అనుకూలంగా లేదనే కారణంతో ఈ నౌకను వదలకుండా అధికారులు పట్టుబట్టారు. వెంటనే ఈ నౌకను వదిలేస్తే పవన్ కళ్యాణ్ కు కోపం వస్తుందనే దాన్ని ఇన్నాళ్లు కాకినాడ పోర్టులో ఉంచారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ నౌకకు విముక్తి లభించింది.
ఇంతకీ స్టెల్లా ఎల్ 1 నౌకను వదిలేయడం వెనుక కూడా చాలా పరిణామాలు జరిగాయి. ముందుగా ఈ నౌక విషయంలో హైకోర్టుకు వెళ్లిన ప్రభుత్వం అందులో రేషన్ బియ్యం విషయంలో వాదనలు చేస్తున్న తరుణంలోనే కేంద్రం నుంచి దీన్ని వదిలేయాలనే ఆదేశాలు వచ్చాయి. ఆఫ్రికా దేశాలతో ఉన్న ఒప్పందం వల్లే ఇలా బియ్యం రవాణా చేస్తున్నట్లు కూడా తేల్చిచెప్పేసింది. ఇలా విదేశీ నౌకను అడ్డుకుంటే దేశాల మధ్య సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందని కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో 55 రోజుల తర్వాత స్టెల్లా ఎల్ 1కు క్లియరెన్స్ ఇచ్చి కస్టమ్స్ అధికారులు దాన్ని గమ్యానికి పంపుతున్నారు.
-
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications