పొలిటీషిన్లు ప్రజలను పట్టించుకోవడం లేదు:పవన్ కల్యాణ్ ట్వీట్!
అమరావతి:దేశ రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇండియాలో పెరిగిపోతున్న రాజకీయ నాయుకుల అవినీతిపై ఆయన తన నిస్పృహను వెళ్లబుచ్చారు. ప్రసిద్ద సామాజిక వేదిక ట్విట్టర్ ద్వారా ఆయన తన ఆవేదన పంచుకున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమని ట్వీట్ చేశారంటే?...
"భారత దేశం ప్రపంచ వేదికపై వెలిగిపోతుండవచ్చు...అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు. కానీ...రాజకీయ అవినీతి, అలాంటి అవినీతికి పాల్పడే రాజకీయ నాయకుల సహజ సిద్ద స్వభావం భారతదేశాన్ని పీడిస్తోంది...భారతదేశ రాజధాని ఢిల్లీతో సహా దేశమంతా ఇలా స్వచ్ఛమైన గాలి లేక అవస్థ పడుతుంది."...అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

"అందుకు అనుబంధంగా పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ కూడా చేశారు..."ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్ కాలుష్యం సమస్య!...ఈ సమస్య పట్ల స్థానిక యువత ఎలా స్పందిస్తారు...కనీసం తాము స్వచ్చమైన గాలి పీల్చుకోవడానికి, స్వచ్చమైన నీరు తాగడానికి కూడా నోచుకోమా?...అంటూ వారు నన్ను ప్రశ్నించారు"












Click it and Unblock the Notifications