బాబుకు 30 ప్రశ్నలు, రుషికొండపై బొత్స..(పిక్చర్స్)
విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్కు నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించిందని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి బుధవారం విమర్శించారు. బుధవారం విశాఖ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.
మంత్రివర్గంలో మైనార్టీలకు, గిరిజనులకు స్థానం కల్పించని ఘతన చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. 'బాబూ ఈ ప్రశ్నలకు బదులేదీ' అంటూ చంద్రబాబు పైన 30 ప్రశ్నలను సంధించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అఖిల పక్ష సమావేశం ఏదని ప్రశ్నించారు.
చంద్రబాబును ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబుకు కావాల్సిన వ్యాపారవేత్తలు విశాఖలోని రుషికొండ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి బుధవారం మండిపడ్డారు. టీడీపీ సైట్ నుండి రుణమాఫీ తదితర అంశాలను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

ఏపీ కాంగ్రెస్
రాజధాని, పోలవరం వంటి కీలక నిర్ణయాలలో పార్టీల సలహాలు తీసుకోలేదన్నారు. పార్టీల సలహాలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు.

ఏపీ కాంగ్రెస్
ట్రాన్స్ట్రాయ్కు రూ.200 కోట్ల చెల్లింపులో పారదర్శకత లేదని విమర్శించారు. ట్రాయ్కు చెల్లింపుల నోటును అఖిల పక్షం ముందు పెట్టాలన్నారు.

ఏపీ కాంగ్రెస్
ఈ-కేబినెట్ పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్నారు. అసలు ఎంతమంది మంత్రులకు కంప్యూటర్లు ఉపయోగించడం తెలుసో చెప్పాలన్నారు. చంద్రబాబుకు ఏపీసీసీ 30 ప్రశ్నలను సంధించింది.

ఏపీ కాంగ్రెస్
పోలవరం ప్రాజెక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్కు నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించిందని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి బుధవారం విమర్శించారు. బుధవారం విశాఖ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.

ఏపీ కాంగ్రెస్
మంత్రివర్గంలో మైనార్టీలకు, గిరిజనులకు స్థానం కల్పించని ఘతన చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. 'బాబూ ఈ ప్రశ్నలకు బదులేదీ' అంటూ చంద్రబాబు పైన 30 ప్రశ్నలను సంధించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అఖిల పక్ష సమావేశం ఏదని ప్రశ్నించారు.

ఏపీ కాంగ్రెస్
చంద్రబాబును ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబుకు కావాల్సిన వ్యాపారవేత్తలు విశాఖలోని రుషికొండ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications