నాయిని ఎదుట 'ఇంద్రజాలం', మయసభలా.. (పిక్చర్స్)
హైదరాబాద్: చిత్ర విచిత్ర జిమ్మిక్కులతో మాయా ప్రపంచాన్ని కళ్ళముందు ఆష్కరిస్తూ దేశ విదేశాల నుంచి విచ్చేసిన వందలాది మంది ఇంద్రజాలికులు అద్భుత ప్రదర్శనలతో అబ్బురపరిచారు.
శనివారం సికింద్రాబాదులోని హరిహర కళాభవన్లో 'చూమంతర్-2014' పేరిట జరిగిన అంతర్జాతీయ ఇంద్రజాలికుల సమ్మేళనం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది.
బంతిని కుందేలుగా మార్చడం, మంత్రదండాన్ని వస్త్రంగా మార్చడం, కర్రలను ఏ ఆధారం లేకుండా గాలిలో ఆడించడం వంటి ఎన్నో రకాల ఇంద్రజాల ప్రదర్శనలను చేసి చూపరులను విశేషంగా అలరింపచేశారు.
ఇంద్రజాలం
రెండు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఆర్టీఐ కమిషనర్ విజయనిర్మలతో కలిసి ప్రారంభించారు.
ఇంద్రజాలం
ఈ సందర్భంగా మంత్రి నర్సింహా రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ ఇంద్రజాలికుల సమ్మేళనం మననగరంలో జరగడం గర్వకారణంగా భావించాలన్నారు.
ఇంద్రజాలం
ఈ సమ్మేళనంలో నగరవాసి సామల వేణును మెర్లిన్ అవార్డు వరించడం సంతోషించదగిన విషయమని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు.
ఇంద్రజాలం
నగరవాసి ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణును మెర్లిన్ అవార్డు వరించింది. ఈ సమ్మేళనంలో నగరవాసి సామల వేణును మెర్లిన్ అవార్డు వరించడం సంతోషించదగిన విషయమని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు.
ఇంద్రజాలం
ఇంద్రజాలంలో విశేష ప్రతిభకు కనబరుస్తూ విద్యకు ఎంతో ప్రాచుర్యాన్ని కల్పించిన వేణును ఈ అవార్డుకు ఎంపిక చేశామని అంతర్జాతీయ ఇంద్రజాలికుల సంఘం సీఈవో అమెరికాకు చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు టోని హసనీ తెలిపారు.
ఇంద్రజాలం
అనంతరం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, టోని హసనీ వేణుకు అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో థాయిలాండ్కు చెందిన ఇంద్రజాలికుడు మమాడ, శ్రీలంకకు చెందిన రొనాల్డ్, లుథియానాకు చెందిన ముగాబో, ఆకుల హరికృష్ణలతో పాటు దేశ విదేశాలకు చెందిన పలువురు పాల్గొన్నారు.
ఇంద్రజాలం
నిత్యం కళా ప్రదర్శనలతో కళకళలాడే హరిహర కళాభవన్ ఇంద్ర జాలికుల సమ్మేళనంతో మయసభను తలపించింది. దేశ విదేశాల నుంచి విచ్చేసిన సుమారు 500 మంది మెజీషియన్లు తమ అద్భుత ప్రదర్శనలతో మాయా ప్రపంచాన్ని సృష్టించారు.
ఇంద్రజాలం
మెజీషియన్ల మధ్య నిర్వహించినర ప్రతిభా పోటీలు, డీలర్ల ప్రదర్శనలు గాలా షోలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇవి అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఇంద్రజాలం
రెండు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఆర్టీఐ కమిషనర్ విజయనిర్మలతో కలిసి ప్రారంభించారు.
ఇంద్రజాలం
ఈ సందర్భంగా మంత్రి నర్సింహా రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ ఇంద్రజాలికుల సమ్మేళనం మననగరంలో జరగడం గర్వకారణంగా భావించాలన్నారు.
ఇంద్రజాలం
ఈ సమ్మేళనంలో నగరవాసి సామల వేణును మెర్లిన్ అవార్డు వరించడం సంతోషించదగిన విషయమని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు.
ఇంద్రజాలం
నగరవాసి ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణును మెర్లిన్ అవార్డు వరించింది. ఈ సమ్మేళనంలో నగరవాసి సామల వేణును మెర్లిన్ అవార్డు వరించడం సంతోషించదగిన విషయమని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు.
ఇంద్రజాలం
ఇంద్రజాలంలో విశేష ప్రతిభకు కనబరుస్తూ విద్యకు ఎంతో ప్రాచుర్యాన్ని కల్పించిన వేణును ఈ అవార్డుకు ఎంపిక చేశామని అంతర్జాతీయ ఇంద్రజాలికుల సంఘం సీఈవో అమెరికాకు చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు టోని హసనీ తెలిపారు.
ఇంద్రజాలం
అనంతరం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, టోని హసనీ వేణుకు అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో థాయిలాండ్కు చెందిన ఇంద్రజాలికుడు మమాడ, శ్రీలంకకు చెందిన రొనాల్డ్, లుథియానాకు చెందిన ముగాబో, ఆకుల హరికృష్ణలతో పాటు దేశ విదేశాలకు చెందిన పలువురు పాల్గొన్నారు.
ఇంద్రజాలం
నిత్యం కళా ప్రదర్శనలతో కళకళలాడే హరిహర కళాభవన్ ఇంద్ర జాలికుల సమ్మేళనంతో మయసభను తలపించింది. దేశ విదేశాల నుంచి విచ్చేసిన సుమారు 500 మంది మెజీషియన్లు తమ అద్భుత ప్రదర్శనలతో మాయా ప్రపంచాన్ని సృష్టించారు.
ఇంద్రజాలం
మెజీషియన్ల మధ్య నిర్వహించినర ప్రతిభా పోటీలు, డీలర్ల ప్రదర్శనలు గాలా షోలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇవి అందర్నీ ఆకట్టుకున్నాయి.