అమ్మాయిపై సర్వెంట్ కన్నేశాడు, అరెస్టు (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్లో ఓ వైద్య విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు సమయస్ఫూర్తితో వ్యవహరించడం... పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు ఆ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుండడంతో నిందితుడ్ని నిమిషాల్లో పట్టుకున్నారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం అర్ధరాత్రి జూబ్లీహిల్స్లో జరిగింది.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. విదేశాల్లో పీజీ పూర్తి చేయాలనుకుంది. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆమె జూన్ ఒకటిన హైదరాబాద్కు వచ్చింది. జూబ్లీహిల్స్లో రోడ్డు నెంబర్ 45లో గల గెస్ట్హౌస్లో దిగింది. రెండు రోజుల క్రితమే పరీక్ష రాసిన ఆమె శనివారం సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాల్సి ఉంది. ఇంతలోనే ఆమెపై అదే గెస్ట్హౌస్లో పని చేస్తున్న సర్వెంట్ కన్ను పడింది. రాత్రి నిద్రపోయే ముందు ప్రతిరోజూ ఆమె తలుపు వేసుకునేది. తర్వాత తలుపు దానికదే లాక్ అయిపోయేది. శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు తలుపు వేసుకున్నప్పటికీ లాక్ పడలేదు.
ఒడిసా రాష్ట్రం బరంపురం జిల్లా రేరంగుపురం గ్రామానికి చెందిన బిక్కి మండల్ ఏడాది క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చి ఇదే గెస్ట్హౌస్లో సర్వెంట్గా పని చేస్తున్నాడు. వైద్య విద్యార్థిని తలుపు లాక్ కాకపోవడాన్ని గమనించిన బిక్కి మండల్ అర్ధరాత్రి ఆమె గదిలోకి వెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో ఇద్దరి మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలు ప్రతిఘటించడంతో బిక్కి బయటకు పరుగులు తీశాడు. తర్వాత ఆమె గెస్ట్హౌస్లోని సిబ్బందికి విషయం చెప్పింది.
వైద్య విద్యార్థిని
సిబ్బంది బిక్కి గురించి గాలిస్తుండగా అతడు రోడ్డు పైకి పారిపోయాడు. దీంతో వారు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందజేశారు. స్టేషన్లోని సిబ్బంది ఈ విషయాన్ని ఆ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు వైర్లెస్ సెట్లో చేరవేశారు.
వైద్య విద్యార్థిని
ఒక పెట్రోలింగ్ వాహనం గెస్ట్హౌస్ వైపు నుంచి వస్తుండగా బిక్కి ఒంటిపై చొక్కా లేకుండా ఓ పెట్రోల్ బంకు వద్దకు పరుగులు తీశాడు. పోలీసులు అతనిని వెంబడించి అరెస్టు చేశారు. బిక్కీ పైన కేసు నమోదు చేశారు.
వైద్య విద్యార్థిని
నిందితుడు బిక్కికి రేరంగుపురంలో ఒక ప్రియురాలు ఉంది. నగరంలో అతడిపై లోగడ ఎటువంటి నేరచరిత్ర లేదని పశ్చిమ మండలం ఉప కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు.
వైద్య విద్యార్థిని
కేసును బంజారాహిల్స్ సహాయ కమిషనర్ ఎం.రమేశ్రెడ్డి పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.