షబ్బీర్ అలీ దులిపేశారు, అరుణ మెచ్చుకోలు (పిక్చర్స్)
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ పైన మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇరువురు ముఖ్యమంత్రుల పైన ధ్వజమెత్తారు.
సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు చంద్రబాబు ఆగితే బాగుంటుందని, ముందుగా ఏపీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తే తెలంగాణ విద్యార్థులు నష్టపోతారన్నారు.
తెలంగాణ విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కావొద్దన్న ప్రభుత్వం... తాము చేపట్టపోయే కౌన్సెలింగ్ తేదీలు, విధివిధానాలు వెల్లడించి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జానా, షబ్బీర్
గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష నేత జానారెడ్డిల ఆలింగనం.
షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు మొనగాళ్లా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
షబ్బీర్ అలీ
ఎంసెట్ కౌన్సెలింగ్ పైన మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇరువురు ముఖ్యమంత్రుల పైన ధ్వజమెత్తారు.
హరీష్ రావు
ప్రతి దాంట్లోను ఆంధ్రప్రదేశ్ సర్కారు కయ్యానికి కాలు దువ్వుతోందని, అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలే నష్టపోతారని హరీష్ రావు గురువారం ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాంగ్రెస్
పార్టీ అధిష్ఠానం ఎవరికి బాధ్యత అప్పగించినా... కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు ఆమె పై విధంగా స్పందించారు. మహబూబ్నగర్ జిల్లా నేతలు విఠల్ రావు, ఒబేదుల్లా కొత్వాల్తో కలిసి డీకె అరుణ గురువారం ఆమె గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బాగానే పని చేస్తున్నారని, అందరినీ కలుపుకొనిపోతూ పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తున్నారని డీకే అరుణ కితాబిచ్చారు.
డీకే అరుణ
టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా... కట్టుడి ఉంటామని, ఎవరికి బాధ్యత అప్పగించినా కలిసి పని చేస్తామని చెప్పారు.
డీకే అరుణ,
సమన్వయ లోపం, నాయకత్వ లోపమే పార్టీ ఓటమికి ప్రధాన కారణాలని తెలిపారు. పార్టీని ఒక నాయకుడంటూ లీడ్ చేయకపోవడం వల్లే ఓటమి చెందామన్నారు.
డీకే అరుణ
టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇద్దామన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని డీకే అరుణ చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.