పోలవరంపై గవర్నర్తో భేటీ తర్వాత అసద్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 200 గ్రామాలను సీమాంధ్రలో కలునపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపై ఆయన గురువారంనాడు గవర్నర్ ఇఎస్ఎల్ నర్సింహన్ను కలిశారు. గవర్నర్తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం సరి కాదని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన అన్నారు. ఇటీవల హైదరాబాదులోని కిషన్బాగ్లో జరిగిన అల్లర్లపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన కోరారు.

గవర్నర్తో భేటీ తర్వాత అసదుద్దీన్
పోలవరం ఆర్డినెన్స్పై గవర్నర్ నర్సింహన్ను కలిసిన మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడారు.

గవర్నర్తో భేటీ తర్వాత అసదుద్దీన్
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం సరి కాదని అసదుద్దీన్ అన్నారు.

గవర్నర్తో భేటీ తర్వాత అసదుద్దీన్
పార్లమెంటు సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పోలవరం ఆర్డినెన్స్ను కేంద్ర జారీ చేయడం మంచిది కాదని అసదుద్దీన్ అన్నారు.

గవర్నర్తో భేటీ తర్వాత అసదుద్దీన్
పోలవరం ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం తొందరపాటు చర్య అని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.

గవర్నర్తో భేటీ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ
ఇటీవల హైదరాబాదులోని కిషన్బాగ్లో జరిగిన అల్లర్లపై న్యాయవిచారణ జరిపించాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.

గవర్నర్తో భేటీ తర్వాత అసదుద్దీన్
హైదరాబాదులోని కిషన్బాగ్ అల్లర్లకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ కోరారు.












Click it and Unblock the Notifications