కోర్టు నుంచి జగన్ ఇలా బయటకు వచ్చారు (పిక్చర్స్)

హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణను నాంపల్లి సిబిఐ కోర్టు ఆగష్టు 11కు వాయిదా వేసింది. సోమవారం ఉదయం కేసు విచారణ నిమిత్తం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా పది చార్జిషీట్లలోని నిందితులు ఈ ఉదయం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో జగన్, మాజీ మంత్రులు పలుమార్లు కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్ కోర్టుకు వచ్చిన నేపథ్యంలో ఆయనను కలుసుకునేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.

మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి, గీతారెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ఓంఎసీ కేసు విచారణను కూడా ఆగష్టు 11కు వాయిదా పడింది. జైలులో ఉన్న ఓఎంసీ నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది. ఈ కేసులో విచారణ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది.

జగన్ ఇలా..

జగన్ ఇలా..

వైయస్ జగన్ కోర్టుకు హాజరై ఇలా బయటకు వస్తూ కనిపించారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద యెత్తున వచ్చారు

కోర్టు నుంచి బయటకు వస్తూ

కోర్టు నుంచి బయటకు వస్తూ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోర్టు నుంచి బయటకు వస్తూ రెండు చేతులూ జోడించి అభివాదం చేశారు.

కోర్టు నుంచి బయటకు వస్తూ

కోర్టు నుంచి బయటకు వస్తూ

కోర్టు నుంచి బయటకు వస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన అభిమానులను చూసి ఇలా నవ్వారు.

సబితా ఇంద్రారెడ్డి ఇలా..

సబితా ఇంద్రారెడ్డి ఇలా..

వైయస్ జగన్ ఆస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బయటకు వస్తూ ఇలా కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+