ఏపీ మంత్రిపై హైకోర్టులో పిల్ వేసిన టీడీపీ నాయకుడు: కౌంటర్కు రెండు వారాల గడువు
అమరావతి: ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్పై తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా ఆరోపణలు చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సమీపంలో 100 ఎకరాల చెరువును మంత్రి, ఆమె అనుచరులు ఆక్రమించుకుంటున్నారంటూ విమర్శలు సంధించారు. దీన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కల్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఈ పిల్ వేశారని తెలుస్తోంది.
మంత్రి
ఉషశ్రీ
చరణ్,
ఆమె
అనుచరుల
పేర్లను
ఈ
పిల్లో
పొందుపరిచినట్లు
చెబుతున్నారు.
కల్యాణదుర్గం
నియోజకవర్గం
పరిధిలోని
సర్వే
నంబర్
329లో
వంద
ఎకరాల
విస్తీర్ణంలో
ఉండే
సుబేదార్
చెరువును
మంత్రి,
ఆమె
అనుచరులు
ఆక్రమించుకుంటున్నారని
ఆరోపించారు.
లారీలు,
టిప్పర్లతో
మట్టిని
తరలించి..చెరువును
పూడ్చి
వేస్తోన్నారని
విమర్శించారు.
ఆ
స్థలాన్ని
ప్లాట్లు,
వెంచర్లుగా
మార్చి
రియల్
ఎస్టేట్
వ్యాపారం
చేయాలని
ప్రయత్నిస్తున్నారని
అన్నారు.
పిటీషనర్ ఉమామహేశ్వర నాయుడు తరఫున ప్రముఖ న్యాయవాది బాలాజీ ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పిల్లో పొందుపరిచిన విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. మంత్రి కావడం వల్ల పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. ఈ పిల్ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.