ఫెర్రీ ప్రాంతంలో రాకాసి చేపలు...బెంబేలెత్తుతున్న మత్స్యకారులు
కృష్ణా జిల్లా:కృష్ణానది తీరంలోని ఫెర్రీ ప్రాంతంలో నీళ్లల్లో పిరాణా తరహా రాకాసి చేపలు తరుచూ దర్శనమిస్తుండటంపై స్థానిక మత్స్యకారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ చేపలు వారికి ఎందుకు పనికిరాకపోగా ప్రమాదకరం, నష్టదాయకం కావడంతో వీటి ఉనికి మత్స్యకారులను బెంబేలెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే...
కెబొజోన్ జాతికి చెందినవిగా భావిస్తున్న ఈ చేపలకు వళ్లంతా ముళ్లతో రాక్షసిలా కనిపిస్తుంది. తినేందుకు ఏమాత్రం పనికిరాని ఈ చేపల నుంచి తీవ్రమైన దుర్వాసన కూడా వస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. పెద్దనోరు కలిగి చిన్నచేపలను అమాంతం మింగేయటంతో పాటు నదిలో చేపల వేట కోసమని వేసిన వలలను కూడా ఇవి కొరికేసి తమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నట్లుగా జాలర్లు వాపోయారు.

ప్రతి ఏడాది పట్టిసీమ కాలువ నుంచి కృష్ణానదికి గోదావరి జలాలు వదిలిన సమయంలోనే ఈ చేపలు కనిపిస్తున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. అయితే ఈసారి కారణమేంటో తెలియదు కాని ఇవి ఎక్కువ సంఖ్యలో ఫెర్రీ ప్రాంతంలో దర్శనమిస్తున్నాయని తెలిపారు. వీటి ధాటికి దడిసి చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నామని మత్స్యకారులు చెబుతుండటం గమనార్హం.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications