''తమిళనాడు తరహలో బిజెపికి బుద్ది చెప్పాలి,పవన్ కళ్యాణ్ సీఎం''
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ క్రితం బయటకు వచ్చి ఏపీ ప్రజల సమస్యలను తీసుకొని పోరాటం చేస్తే ముఖ్యమంత్రి అయ్యేవారని ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నిర్వహించిన జెఎఫ్సి సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించినట్టు ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చెప్పారు. ఓ తెలుగు ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఏపీ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ద్రోహం చేసిందని చలసాని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయలేదని ఆయన విమర్శించారు.ఏపీకి దక్కాల్సిన వాటాపై ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్కు సీఎం అయ్యే చాన్స్ ఉంది
ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ రెండేళ్ళ క్రితమే ఉద్యమాలను ప్రారంభిస్తే 2019 ఎన్నికల్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉండేదని ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావుఅభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కలేని విషయాన్ని గుర్తించిన సమయంలో ప్రారంభించిన పోరాటాన్ని కొనసాగిస్తే ప్రయోజనం ఉండేదని ఆయన చెప్పారు. నిరంతరం ప్రజల సమస్యలను తీసుకొని పనిచేయడం ద్వారా ఫలితం ఉంటుందున్నారు. అయితే ప్రజల సమస్యలపై పనిచేయాలని పవన్ కళ్యాణ్ తీసుకొన్న నిర్ణయం రానున్న రోజుల్లో ఆయనకు కలిసి వస్తోందని చలసాని అభిప్రాయపడ్డారు.

ఏపీకి కేంద్రం అన్యాయం
ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావుఅభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీలను కేంద్రం విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు మొండి చేయి చూపిందన్నారు. ఏపీ ప్రజలను మోసం చేయడంలో కేంద్రం మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.రక్తం సలసల మరుగుతోంటే ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదని చంద్రబాబునాయుడును చలసాని శ్రీనివాసరావు ప్రశ్నించారు.

బిజెపి నేతలు ఉత్తరాది కోసం మాట్లాడుతున్నారు
ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావుఅభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీలను కేంద్రం విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు మొండి చేయి చూపిందన్నారు. ఏపీ ప్రజలను మోసం చేయడంలో కేంద్రం మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.రక్తం సలసల మరుగుతోంటే ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదని చంద్రబాబునాయుడును చలసాని శ్రీనివాసరావు ప్రశ్నించారు.

తెలుగుజాతి మూకుమ్మడిగా పోరాటం చేయాలి
ఏపీకి జరిగిన అన్యాయం పై తెలుగుజాతి మూకుమ్మడిగా పోరాటం చేయాల్సి ఉందని ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు కోరారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పుస్తకాల రూపంలో ప్రజలను చైతన్యం చేస్తున్నామని చలసాని చెప్పారు.అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications