''తమిళనాడు తరహలో బిజెపికి బుద్ది చెప్పాలి,పవన్ కళ్యాణ్ సీఎం''
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ క్రితం బయటకు వచ్చి ఏపీ ప్రజల సమస్యలను తీసుకొని పోరాటం చేస్తే ముఖ్యమంత్రి అయ్యేవారని ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నిర్వహించిన జెఎఫ్సి సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించినట్టు ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చెప్పారు. ఓ తెలుగు ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఏపీ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ద్రోహం చేసిందని చలసాని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయలేదని ఆయన విమర్శించారు.ఏపీకి దక్కాల్సిన వాటాపై ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్కు సీఎం అయ్యే చాన్స్ ఉంది
ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ రెండేళ్ళ క్రితమే ఉద్యమాలను ప్రారంభిస్తే 2019 ఎన్నికల్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉండేదని ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావుఅభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కలేని విషయాన్ని గుర్తించిన సమయంలో ప్రారంభించిన పోరాటాన్ని కొనసాగిస్తే ప్రయోజనం ఉండేదని ఆయన చెప్పారు. నిరంతరం ప్రజల సమస్యలను తీసుకొని పనిచేయడం ద్వారా ఫలితం ఉంటుందున్నారు. అయితే ప్రజల సమస్యలపై పనిచేయాలని పవన్ కళ్యాణ్ తీసుకొన్న నిర్ణయం రానున్న రోజుల్లో ఆయనకు కలిసి వస్తోందని చలసాని అభిప్రాయపడ్డారు.

ఏపీకి కేంద్రం అన్యాయం
ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావుఅభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీలను కేంద్రం విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు మొండి చేయి చూపిందన్నారు. ఏపీ ప్రజలను మోసం చేయడంలో కేంద్రం మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.రక్తం సలసల మరుగుతోంటే ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదని చంద్రబాబునాయుడును చలసాని శ్రీనివాసరావు ప్రశ్నించారు.

బిజెపి నేతలు ఉత్తరాది కోసం మాట్లాడుతున్నారు
ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావుఅభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీలను కేంద్రం విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు మొండి చేయి చూపిందన్నారు. ఏపీ ప్రజలను మోసం చేయడంలో కేంద్రం మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.రక్తం సలసల మరుగుతోంటే ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదని చంద్రబాబునాయుడును చలసాని శ్రీనివాసరావు ప్రశ్నించారు.

తెలుగుజాతి మూకుమ్మడిగా పోరాటం చేయాలి
ఏపీకి జరిగిన అన్యాయం పై తెలుగుజాతి మూకుమ్మడిగా పోరాటం చేయాల్సి ఉందని ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు కోరారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పుస్తకాల రూపంలో ప్రజలను చైతన్యం చేస్తున్నామని చలసాని చెప్పారు.అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications