Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రామోజీ డాల్ఫిన్ హోటల్లో పేకాట: 8 మంది అరెస్టు

విశాఖపట్నం: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్లో పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకున్నట్లు నగర టాస్క్‌ఫోర్స్ సిఐ ఇలియాస్ అహ్మద్ తెలిపినట్లు సాక్షి మీడియా రాసింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారమంటూ వార్తాకథనాన్ని ప్రచురించింది.

డాల్ఫిన్ హోటల్లో చాలా రోజులుగా పేకాట స్థావరం నడుపుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొందరు నగరంలోని ఓ పెద్ద హోటల్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం కొద్ది రోజుల క్రితమే టాస్క్‌ఫోర్స్‌కు చేరింది. అయితే ఏ హోటల్ అనేది నిర్ధారణ కాలేదు.

విశాఖపట్నం

మంగళవారం మధ్యాహ్నం విశ్వసనీయమైన సమాచారం అందడంతో సిఐ ఇలియాస్ అహ్మద్ తన బృందంతో సాయంత్రం డాల్ఫిన్ హోటల్‌కు చేరుకున్నారు. బయట వేచి ఉండి లోపల ఏ గదిలో పేకాట ఆడుతున్నారో ఇన్‌ఫార్మర్ ద్వారా నిర్ధారించుకున్నారు.

సమాచారం నిజమేనని తేలడంతో వెంటనే హోటల్‌పై దాడి చేశారు. రూమ్ నెంబర్ 605లో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.51,600 నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, హైదరాబాద్, కడప ప్రాంతాలకు చెందినవారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+