జల్లేరు వాగు బస్సు ప్రమాద మృతులకు ప్రధాని సంతాపం-2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం సమీపంలో ఉన్న జల్లేరు వాగులో బస్సు పడిన ఘటనలో ఇవాళ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ డ్రైవర్ తో పాటు 8 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబుతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపాలు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా స్పందించారు.
జల్లేరు వాగు బస్సు ప్రమాద ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధాని మోడీ కార్యాలయం ఇవాళ ట్వీట్ చేసింది. బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రధాని జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం ట్వీట్ లో ప్రకటించింది.

జల్లేరు వాగు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోడీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించడంపై సోము సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం పంపిన ట్వీట్ కు సోము వీర్రాజు రీట్వీట్ చేశారు. మరోవైపు జల్లేరు వాగు బస్సు ప్రమాదఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఇప్పటికే ప్రాధమిక విచారణ ఆధారంగా లారీని తప్పించబోయి ఈ బస్సు వాగులో పడిందని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం మరింత లోతుగా దర్యాపు చేయాలని నిర్ణయించింది. బస్సు ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబాల్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఇప్పటికే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్నినాని ప్రకటించారు. అలాగే సీఎం జగన్ కూడా బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.


-
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications