మోడీ విందు రాజకీయంలో ఆ టీడీపీ ఎంపీ ! పార్లమెంట్ క్యాంటీన్లో పనిష్మెంట్ !
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ దేశంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోడీ.. అందుకు తగ్గట్టే హస్తినలో పావులు కదుపుతున్నారు. తమ పాత మిత్రుడు చంద్రబాబును ఢిల్లీకి రప్పించి అమిత్ షా- నడ్డాతో చర్చలు ఏర్పాటు చేయించిన మోడీ.. అనంతరం ఆ పార్టీ ఎంపీ ఒకరిని మరో ఏడుగురు ఎంపీలతో ఇవాళ పార్లమెంట్ క్యాంటీన్ లో విందుకు పిలిచారు.
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడితో సహా పలు పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎంపీలకు ఇవాళ మధ్యాహ్నం పీఎంవో నుంచి హఠాత్తుగా కాల్ వచ్చింది. ప్రధాని మోడీ మీతో పార్లమెంట్ క్యాంటీన్ లో విందుకు సిద్దంగా ఉన్నారనేది ఆ కాల్ సారాంశం. దీంతో వీరంతా షాకయ్యారు. కాసేపట్లో తేరుకుని పార్లమెంట్ క్యాంటీన్ కు పరుగులు తీశారు. అక్కడకు ప్రధాని మోడీ కూడా రావడంతో వీరితో ప్రధాని మోడీ రండి.. మీకో పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానంటూ.. క్యాంటీన్ కు తీసుకెళ్లారు.

#WATCH | Delhi | Prime Minister Narendra Modi had lunch with MPs at Parliament Canteen today. pic.twitter.com/GhcfaynYJt
— ANI (@ANI) February 9, 2024
ప్రధాని మోడీతో విందు భేటీలో ఏం జరిగిందనే దానిపై సదరు 8 మంది ఎంపీలు నోరు విప్పలేదు. అయితే మోడీతో విందు చేశామంటూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ప్రధాని మోడీ విందు రాజకీయం ఇప్పుడు అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపి ఎన్డీయేలోకి చేర్చుకునేందుకు మోడీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా హ్యాట్రిక్ కూడా మరింత బలంగా ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది.
Had a pleasant interaction with Prime Minister @narendramodi ji at the parliament canteen during the lunch with fellow parliamentarian’s. pic.twitter.com/hAhM24hutM
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) February 9, 2024
ఇంతకీ ప్రధాని మోడీతో కలిసి పార్లమెంట్ క్యాంటీన్ లో విందు భోజనం చేసిన వారిలో బీజేపీ ఎంపీలు హీనా గవిట్, ఎస్.ఫాంగ్నాన్ కొన్యాక్, జమ్యాంగ్ త్సెరింగ్ నామ్గ్యాల్, ఎల్ మురుగన్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర ఉన్నారు. వీరంతా ప్రధాని మోదీతో కలిసి ఉల్లాసంగా భోజనం చేసి ఫొటోలు కూడా దిగారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications