సోమిరెడ్డికి ఊరట, కాకాని పత్రాలన్నీ నకిలీవే: ముగ్గురి అరెస్ట్
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిచెందిన సర్వేపల్లి ఎంఏల్ ఏ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి .
నెల్లూరు :టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిచెందిన సర్వేపల్లి ఎంఏల్ ఏ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి చూపిన పత్రాలన్నీ నకిలీ పత్రాలేనని పోలీసులు తేల్చారు.
టిడిపి ఎంఏల్ సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులు కలిగి ఉన్నాడని కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడ ఘాటుగానే స్పంధించారు. ఈ విషయమై విచారణ జరిపించాలని ఆయన పోలీసులను ఆశ్రయించాడు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ కాకాని గోవర్థన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని చూపిన పత్రాలన్నీ నకిలీవేనని పోలీసులు తేల్చారు.అయితే ఈ నకిలీ పత్రాలను సృష్టించిన వారిని పోలీసులు అరెస్టుచేశారు.
ఈ పత్రాల తయారీలో ప్రమేయమున్నట్టు చిత్తూరు జిల్లాకు చెందిన మణిమోహన్ అలియాస్ చిరంజీవి ,పి.వెంకటకృష్ణన్, హరిహరన్ లను పోలీసులు బుదవరాం నాడు అరెస్టు చేశారు. ఈ కేసును చేధించిన పోలీసులను ఎస్ పి విశాల్ గున్నీ అభినందించారు.