కారులో 65లక్షల బ్లాక్ మనీ : పోలీసులు పట్టేసుకున్నారు..
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 65లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మద్దిపాడు : పెద్దనోట్ల రద్దు తర్వాత.. భారీ మొత్తంలో కూడబెట్టుకున్న నల్లధనాన్ని వైట్ గా ఎలా మార్చుకోవాలన్న ప్రయత్నాల్లో మునిగిపోయారు చాలామంది నల్లకుబేరులు. ఈ క్రమంలో కొంతమంది కమిషన్ ఏజెంట్ల చేతిలో మోసపోతుంటే.. మరికొంతమంది వాటిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 65లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి సరైన ధ్రువ పత్రాలేవి లేకపోవడం వల్లే నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.
నగదుతో పాటు డబ్బును తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ డబ్బును వారు ఒంగోలు నుంచి గుంటూరు తరలిస్తున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నగదును గుంటూరుకు చెందిన కోట హన్మంతుదిగా గుర్తించారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఐటీ శాఖకు అప్పగించనున్నట్టు చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications