సీయం రమేష్ ఇంటి పై పోలీసులు దాడులు : ఎస్పీ ఆదేశాల మేరకే : సీయం సీరియస్..!
ఎన్నికల వేళ కడప జిల్లాలోని టిడిపి నేతలు లక్ష్యంగా మారుతున్నారు. మైదుకూరు అభ్యర్ది పుట్టా సుధాకర్ యాదవ్ పై ఐటి దాడులు జరిగ్గా..ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ నివాసం లో పోలీసులు దాడులు చేసారు. జిల్లా ఎస్సీ ఆదేశాల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయని సోదాల్లో పాల్గొన్న పోలీసు అధికారులు చెబుతున్నారు.

సీయం రమేష్ నివాసంలో..
టిడిపి రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ నివాసం పై పోలీసులు దాడి చేసారు. కడప జిల్లాలోని పోట్లదుర్తితోని ఆయన నివాసం లో దాదాపు 50 మంది పోలీసులు ప్రవేశించి సోదాలు నిర్వహించారు. సడన్ గా పోలీసులు ఇంటి వద్దకు రావ టంతో సీయం రమేష్ వారిని నిలదీసారు. వారు బెడ్ రూం లో సైతం ప్రవేశించటం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చే సారు. దీని పై ఆగ్రహం వ్యక్తం చేసిన రమేష్ సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. దీని తో ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో వారెంట్ అసవరం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అదే సమయంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే ఈ సోదాలు నిర్వహిస్తున్నామంటూ స్పష్టం చేసారు.

కొత్త ఎస్పీ ఆదేశాల మేరకే..
కొద్ది రోజుల క్రితం వరకు కడప ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ ఉండేవారు. ఎన్నికల సంఘం ఆయన్ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో తాజాగా అభిషేక్ మహంతిని ఎస్పీగా నియమించారు. అయితే, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సభ్యుడు నివాసంలో సోదాలు నిర్వహించటం తో దీని పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. కక్ష సాధింపులో భాగంగానే పోలీ సులు దాడులు చేస్తున్నారని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. కడప జిల్లాలో రమేష్ టిడిపి లో కీలక నేతగా ఉన్నారు. ఆయన అక్కడ పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్దులకు ఆర్దికంగా సాయం అందిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోం ది. దీంతో..సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు అని పోలీసులు చెబుతున్నా..తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధా రంగానే సోదాలు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే, టిడిపి నేతలు మాత్రం ఇదంతా కేంద్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

జగన్ కంట్రోల్ లో ఇసి ఉందా...
ఎన్నికల సంఘం జగన్ సూచనల మేరకు పని చేస్తుందా అనే అనుమానం కలుగుతుందని టిటిపి నేతలు అంటున్నా రు. తాజాగా, మైదుకూరు టిడిపి అభ్యర్ది పుట్టా సుధాకర్ యాదవ్ నివాసం పై ఐటి సోదాలు జరిగాయి. ఆ వెంటనే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ నివాసంలో జిల్లా పోలీసులు సోదాలు చేసారు. దీని పై ముఖ్యమంత్రి చం ద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయం లో టిడిపి నేతలు..కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బ తీయటం కోసమే ఢిల్లీ నుండి వస్తున్న ఆదేశాల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. అయితే, సోదాల్లో ఏమీ దొరకలేదని సీయం రమేష్ అనుచరులు చెబుతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications