ఏపిలో అరాచక పాలన, భయపడం: చంద్రబాబుపై తెలంగాణ జగన్ పార్టీ నేత పొంగులేటి ఫైర్
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు.
చంద్రబాబు సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటామన్నారు. ఎలాంటి బెదిరింపులకు తాము భయపడమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ 420 అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా, నారాయణస్వామి ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని చంద్రబాబు కుట్రపన్నుతున్నారని విమర్శించారు.
మిథున్ రెడ్డి ప్రజాదరణ ఉన్న నాయకుడని.. అది ఓర్వలేక మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ముసునూరు ఎమ్వార్వో వనజాక్షిపై దాడి చేసిన దెందులూరు టిడిపి ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశ్నించారు.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications