30 లక్షల పేదలకు పట్టాల పంపిణీ, 15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం: మంత్రి బొత్స
పేదలకు ఇళ్ల పట్టాలు రేపు (శుక్రవారం) పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చెప్పినట్టే పేదలకు ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పారు. తమది చేతల ప్రభుత్వం అని మరోసారి స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని.. పేదల సంక్షేమమే తమకు ప్రయారిటీ అని తేల్చిచెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని తెలియజేశారు.
పేద ప్రజల సొంతింటి కల శుక్రవారం నెరవేరబోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు. 15 లక్షల ఇళ్ల పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ పాల్గొంటారని బొత్స సత్యనారాయణ తెలియజేశారు. మిగతా చోట్ల మంత్రులు హాజరవుతారని వివరించారు.

2.62 లక్షల మందికి టిడ్కో ఇళ్లు ఇస్తామని ఆయన తెలిపారు. కొత్త లేఔట్లతో 17 వేల కొత్త గ్రామాలు రూపొందాయని చెప్పారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కోటరీ మాత్రం కోర్టులకు వెళ్లడం వల్ల ఆలస్యమైందని తెలిపారు. 23 వేల కోట్ల విలువైన భూములను పంపిణీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ పట్టణంలోనే 1350 కోట్ల విలువైన 4457 ఎకరాలు పంపిణీ చేస్తామని వివరించారు. మిగతా చోట్ల కూడా విలువైన భూములను సేకరించామని పేర్కొన్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications