మందేసి, లోకేష్.. అమ్మాయిల నడుములు కొలిచాడు: పోసాని సంచలనం
Recommended Video

హైదరాబాద్: ఏపీ అధికార పక్షం టీడీపీ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. హోదా కోసం పోరాడుతున్నామన్న విశ్వాసం కలిగించలేక.. ప్రత్యర్థుల ఆరోపణలను తట్టుకోలేక విలవిల్లాడిపోతోంది. ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో.. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు కూడా మొదటికే మోసం తెచ్చేలా మారాయి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయి. దీంతో చలన చిత్ర ప్రముఖులు సైతం టీడీపీని గట్టిగానే పారేస్తున్నారు.

అప్పుడు లాఠీలతో కొట్టించి..:
నటుడు, రచయిత అయిన పోసాని కృష్ణ మురళి.. టీడీపీ ప్రభుత్వాన్ని నిలువునా కడిగిపారేస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నచోట ప్రజా ఉద్యమాలు ఎలా పుట్టుకొస్తాయని ప్రశ్నిస్తున్నారు. హోదా కోసం గతంలో ఉద్యమిస్తే.. లాఠీలతో కొట్టించి, అరెస్టులు చేయించి.. మళ్లీ ఇప్పుడు మాట మార్చడానికి సిగ్గు లేదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

చేవ చచ్చిందా అంటే.. అర్థాలు మారుతాయి:
సినీ పరిశ్రమపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలకు కూడా ఘాటైన కౌంటర్ ఇచ్చారు పోసాని. 'మీరు లేచినప్పుడే మేమూ లేవాలా?.. మీకంటే ముందు మేము లేచినప్పుడేమో లాఠీలతో కొట్టిస్తారా?..' అని ప్రశ్నించారు. చేవ చచ్చిపోయిందా? అని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నిస్తున్నారని.. దానికి అనేక రకాల అర్థాలున్నాయని పేర్కొన్నారు. ఇక టీడీపీ, లోకేష్ అవినీతి ఆరోపణలపై నిజనిజాలేంటో తనకు తెలియదని కాబట్టి వాటిపై మాత్రం స్పందించనని అన్నారు పోసాని.

అమ్మాయిల నడుములు కొలుస్తున్నాడు..:
ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సంపాదిస్తున్న వందల కోట్ల మత్తులో జోగుతున్నారా? అన్న ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్కు మరో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు పోసాని. మత్తులో జోగుతున్నది సినిమావాళ్లు కాదని, అసలు మత్తులో జోగుతోంది ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అని అన్నారు. గతంలో లీకైన లోకేష్ విదేశీ ఫోటోలను చూపుతూ.. 'ఆయన కేవలం అమ్మాయిలతోనే మందు తాగుతారు, విదేశాల్లో టేపుతో అమ్మాయిల నడుమును కొలుస్తారు' అని పోసాని ఎద్దేవా చేశారు.

ముందు అది తెలుసుకో:
స్విమ్మింగ్ పూల్లో మందు తాగుతూ.. అమ్మాయిలతో గడుపుతూ.. సినిమా వాళ్ల కన్నా నీచంగా ప్రవర్తించింది మీ నాయకుడే అన్న విషయాన్ని రాజేంద్రప్రసాద్ గుర్తెరగాలని పోసాని మండిపడ్డారు. ఎదుటివారిపై విమర్శలు చేసే ముందు కాస్త తెలివితో మాట్లాడాలని హితవు పలికారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications