నడిరోడ్డుపై నిలిచిన బస్సు: రాత్రంతా జాగారం
విజయవాడ: ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల సమయంలోనే కాకా అకారణంగానూ ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలు, సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్వవహరిస్తున్నాయి.
ఇలాంటి సంఘటన మంగళవారం విజయవాడలోని వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కాకినాడ నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్కు బయలుదేరిన దీపక్ ట్రావెల్స్ వోల్వో బస్సు అర్ధరాత్రి విజయవాడలోని బందరు రోడ్డులో నిలిచిపోయింది.

డ్రైవర్ బస్సును ఎందుకు నిలిపివేశాడో తెలియక ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి నిలిచిపోయిన బస్సు మంగళవారం ఉదయం దాకా కదలకపోవడంతో ప్రయాణీకులు బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. ప్రయాణీకులు రాత్రి నుంచి నడిరోడ్డుపైనే జాగారం చేస్తున్నారు.
దీపక్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని సంప్రదించేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో, తమను వేరొక బస్సులో హైదరాబాద్కు తరలించాలంటూ ప్రయాణీకులు అక్కడే, నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications