Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూటమి సర్కార్ కు కోవర్డుల తలనొప్పి ? సీఎం, మంత్రుల ఆదేశాలూ బేఖాతర్.. !

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోయి రెండు నెలలు కావస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం అక్రమాలను తవ్వితీసే పనిలో ఉంది. ముఖ్యంగా రంగాల వారీగా శ్వేతపత్రాల రూపంలో గత ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇందులో కీలక స్ధానాల్లో ఉన్న కొందరు అధికారుల నుంచి ప్రభుత్వానికి సహకారం అందడం లేదని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రాజ్యమేలిన వీరే ఇప్పుడు తమ హవా కొనసాగిస్తున్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని భావించింది. అయితే అందుకు కావాల్సిన గణాంకాలను ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, ముఖ్యమంత్రికి అందించాల్సింది మాత్రం అధికారులే. కానీ వారిలో కొందరు అలా చేయలేదు. రకరకాల సాకులు చెప్పి గత ప్రభుత్వ లెక్కలు ఇవ్వకుండా కాలం గడిపేస్తున్నారు. దీంతో ప్రభుత్వం సకాలంలో శ్వేతపత్రాలు విడుదల చేయలేకపోయింది.

pro-ysrcp officials headache to nda government in ap- here is why

ఇలా శ్వేతపత్రాలు ఆలస్యం కావడంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్దితుల్లో సభలోనే వాటి విడుదలకు ప్రభుత్వం సిద్దమైంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మద్యం, శాంతిభద్రతలు, ఆర్ధిక వ్యవస్ధపై శ్వేతపత్రాలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. దీంతో పాటు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమధానాలు చెప్పాల్సి ఉంది. వీరికి కావాల్సిన సమాచారం కూడా పూర్తిస్ధాయిలో అందడం లేదని తెలుస్తోంది. దీంతో ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే స్పీకర్, మండలి ఛైర్మన్ పూర్తి సమాచారంతో రావాలని అధికారుల్ని ఆదేశించినా వారు తమ శైలిని మార్చుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం తలపట్టుకుంటోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+