కూటమి సర్కార్ కు కోవర్డుల తలనొప్పి ? సీఎం, మంత్రుల ఆదేశాలూ బేఖాతర్.. !
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోయి రెండు నెలలు కావస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం అక్రమాలను తవ్వితీసే పనిలో ఉంది. ముఖ్యంగా రంగాల వారీగా శ్వేతపత్రాల రూపంలో గత ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇందులో కీలక స్ధానాల్లో ఉన్న కొందరు అధికారుల నుంచి ప్రభుత్వానికి సహకారం అందడం లేదని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రాజ్యమేలిన వీరే ఇప్పుడు తమ హవా కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని భావించింది. అయితే అందుకు కావాల్సిన గణాంకాలను ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, ముఖ్యమంత్రికి అందించాల్సింది మాత్రం అధికారులే. కానీ వారిలో కొందరు అలా చేయలేదు. రకరకాల సాకులు చెప్పి గత ప్రభుత్వ లెక్కలు ఇవ్వకుండా కాలం గడిపేస్తున్నారు. దీంతో ప్రభుత్వం సకాలంలో శ్వేతపత్రాలు విడుదల చేయలేకపోయింది.

ఇలా శ్వేతపత్రాలు ఆలస్యం కావడంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్దితుల్లో సభలోనే వాటి విడుదలకు ప్రభుత్వం సిద్దమైంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మద్యం, శాంతిభద్రతలు, ఆర్ధిక వ్యవస్ధపై శ్వేతపత్రాలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. దీంతో పాటు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమధానాలు చెప్పాల్సి ఉంది. వీరికి కావాల్సిన సమాచారం కూడా పూర్తిస్ధాయిలో అందడం లేదని తెలుస్తోంది. దీంతో ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే స్పీకర్, మండలి ఛైర్మన్ పూర్తి సమాచారంతో రావాలని అధికారుల్ని ఆదేశించినా వారు తమ శైలిని మార్చుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం తలపట్టుకుంటోంది.
-
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్












Click it and Unblock the Notifications