వ్యభిచారం: ఐదుగురు బెంగాలీ యువతుల పట్టివేత, నిర్వాకుడి అరెస్టు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం పీఎం పాలెంలో టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు బెంగాల్ యువతులను, వ్యభిచార గృహ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేశారు.
ఆటో బోల్తా పడి మహిళ మృతి
శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలం కంచరాంలో ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందింది. ఆటో అతివేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని అంటున్నారు. పోలీసులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు.
బాలుడిని వదిలేశారు...
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇండస్ట్రియల్ ఏరియా ట్రాన్స్కో ఆఫీసులో గుర్తు తెలియని వ్యక్తులు మూడేళ్ల బాలుడిని వదిలి వెళ్లారు. మాటలు కూడా స్పష్టంగా రాని ఆ బాలుడు తన తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ వివరాలు చెప్పలేక పోతున్నాడు. ట్రాన్స్ కో అధికారులు పోలీసులకు ఫోన్ చేసి బాలుడి విషయం తెలిపారు.