అసలు ఎందుకో: మోడీకి బాబు ఝలక్, జగన్ ఇలాకాలో నీటి కోసం సీఎం వద్దకు..
రూ.2000 నోటును రద్దు చేయాలని, దాంతో అవినీతి పెరుగుతుందని చెప్పడం ద్వారా కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చినట్లయింది.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.2వేల నోటు పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు రూ.2000 నోటు ఎందుకు వచ్చిందని అడుగుతున్నారని, రేట్లు పెరిగి వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారని, అది తేవడం సరైన పద్ధతి కాదని అన్నారు.
మోడీ ప్రభుత్వం పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, రూ.2000 నోటును తెచ్చిన విషయం తెలిసిందే. పెద్ద నోటు తీసుకు రావడాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు, లోకేష్ సహా టిడిపి నేతలు రూ.2000 నోటును వెనక్కి తీసుకోవాలంటున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరు బ్లాక్ మనీ పోవాలని అంటున్నారని, రూ.2వేల నోట్లు పెడితే ఎలా పోతుందని ప్రశ్నించారు. దీని వల్ల బ్లాక్ మనీ మరింత పెరుగుతుందన్నారు. కాగా, ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా మోడీని ఉద్దేశించే అంటున్నారు.
చంద్రబాబుతో పులివెందుల చినీ రైతులు భేటీ
పులివెందుల చినీ రైతులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డితో కలిసి రైతులు చంద్రబాబును కలిశారు. తమ చినీ తోటలకు నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులతో మాట్లాడారు.
రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదే అన్నారు. గాలేరు - నగరిని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. చిత్రావతి, గండికోట ప్రాజెక్టులను నింపే బాధ్యత తనదే అన్నారు. సీమ ప్రాజెక్టులు పూర్తయితే రూ.400 టీఎంసీల నీటిని ఒడిసి పెట్టవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.35వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. కృష్ణా - పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తామన్నారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications