వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సీరియస్ , జగన్ మెచ్చుకున్న మరుసటి రోజే డిప్యూటీ సీఎం క్లాస్
ఏపి డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి రాష్ట్రంలో పనిచేస్తున్న వాలంటీర్ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు . ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు సన్మానం చేసే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టింది. తాజాగా విజయనగరం జిల్లా కురుపాంలో వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పలువురు వాలంటీర్లపై బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
పోలీసులపై ఆరోపణలు చేస్తూ విశాఖలో 32 మంది వాలంటీర్ల రాజీనామా .. అసలేం జరిగిందంటే !!
వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఫైర్
కొంతమంది వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని, వైసిపి, సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. గురుగు బిల్లి మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాలంటీర్ భర్త ఎన్నికల్లో పోటీ చేసాడని పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ సైతం మెచ్చుకున్నారని పుష్పశ్రీవాణి రాష్ట్రంలో వాలంటీర్లకు గుర్తింపు లభించింది అంటే అది సీఎం జగన్ వల్లే అంటూ వ్యాఖ్యానించారు.
90% మంది ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తుంటే 10 శాతం వ్యతిరేక శక్తులుగా
90% మంది ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తుంటే 10 శాతం ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులుగా పనిచేస్తున్నారని పుష్ప శ్రీవాణి మండిపడ్డారు.
ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు సన్మానం చేసి, ఉగాది సందర్భంగా వారికి సేవా పురస్కారాలు అందించిన విషయం తెలిసిందే . రాజకీయాలకతీతంగా వాలంటీర్ల సేవలు చేస్తున్నారని కుల మత ప్రాంత వేదాలను పక్కనపెట్టి పనిచేస్తున్నారని, ఏపీలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధాన కర్తగా వాలంటీర్లు ఉన్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
జగన్ మెచ్చుకున్న మరుసటి రోజే వాలంటీర్లకు క్లాస్
విమర్శలకు అతీతంగా పని చేయాలని సూచించిన జగన్ వాలంటీర్లకు సెల్యూట్ చేశారు. నిండు మనసుతో వారికి అభినందనలు తెలిపారు.
ఇది జరిగి 24 గంటలైనా కాకముందే డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి వాలంటీర్లకు క్లాస్ పీకారు . కొందరు ప్రభుత్వానికి వైయస్ జగన్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇది మంచి పద్ధతి కాదని పుష్పశ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వల్లే వారికి గుర్తింపు వచ్చిందంటూ గుర్తు చేశారు.
ఏపీలో ఘనంగా అబేండ్కర్ జయంతి వేడుకలు