జగన్పై దాడి: తప్పుదోవ పట్టిస్తున్న బాబు, భయపెడతారా?: శివాజీకే అప్పగించండంటూ పైడికొండల
తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు తీవ్రంగా ఖండించారు. జగన్పై దాడి జరిగితే మీరు స్పందించే తీరు ఇదా? అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారు..
కాకినాడలో పైడికొండల మాణిక్యాల రావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపిస్తేనే ప్రజలు నిజాలు తెలుస్తాయని అన్నారు. జగన్పై జరిగిన దాడి ఆయన అభిమానే చేశాడని, చిన్న గాయమే అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారు.

ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసి..
ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాష్ట్రంలో సంచరించడానికి భయపడే పరిస్థితులను ధ్వజమెత్తారు. ప్రాణభయంతో ప్రతిపక్షాలు బయట తిరగకుండా ఉంటే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విమానాశ్రయాలను ఏపీ పోలీసులే పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గతంలో విశాఖ విమానాశ్రయంలో రన్ వేపైనే రాష్ట్రానికి చెందిన పోలీసులు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నారని గుర్తు చేశారు.

శివాజీ చెప్పిందే నిజమైతే మీరెందుకు?
ఆపరేషన్ గరుడ అంటూ సినీనటుడు శివాజీ చెప్పింది నిజమే అయితే.. ఎందుకు మీ ప్రభుత్వం.. మీ పోలీసు వ్యవస్థ.. జగన్పై జరిగిన దాడిని అడ్డుకోలేకపోయిందని చంద్రబాబును మాణిక్యాల రావు ప్రశ్నించారు. ఒకవేళ శివాజీ చెప్పిందే నిజమైతే దాడి మీ ఫెయిల్యూర్గా భావించి మీరు, హోంమంత్రి చినరాజప్ప రాజీనామా చేసి ప్రభుత్వాన్ని శివాజీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

శివాజీని విచారించేందుకు భయపడుతున్నారా?
ఇప్పటికైనా శివాజీని అరెస్ట్ చేసి ఆపరేషన్ గరుడ వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపించాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. ఒక వేళ ఆపరేషన్ గరుడపై విచారణ జరిపితే దీని వెనకున్న పెద్దలకు, మీ ప్రభుత్వానికి నష్టమని భయపడుతున్నారా? అని చంద్రబాబును మాణిక్యాలరావు నిలదీశారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications