జగన్పై దాడి: తప్పుదోవ పట్టిస్తున్న బాబు, భయపెడతారా?: శివాజీకే అప్పగించండంటూ పైడికొండల
తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు తీవ్రంగా ఖండించారు. జగన్పై దాడి జరిగితే మీరు స్పందించే తీరు ఇదా? అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారు..
కాకినాడలో పైడికొండల మాణిక్యాల రావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపిస్తేనే ప్రజలు నిజాలు తెలుస్తాయని అన్నారు. జగన్పై జరిగిన దాడి ఆయన అభిమానే చేశాడని, చిన్న గాయమే అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారు.

ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసి..
ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాష్ట్రంలో సంచరించడానికి భయపడే పరిస్థితులను ధ్వజమెత్తారు. ప్రాణభయంతో ప్రతిపక్షాలు బయట తిరగకుండా ఉంటే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విమానాశ్రయాలను ఏపీ పోలీసులే పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గతంలో విశాఖ విమానాశ్రయంలో రన్ వేపైనే రాష్ట్రానికి చెందిన పోలీసులు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నారని గుర్తు చేశారు.

శివాజీ చెప్పిందే నిజమైతే మీరెందుకు?
ఆపరేషన్ గరుడ అంటూ సినీనటుడు శివాజీ చెప్పింది నిజమే అయితే.. ఎందుకు మీ ప్రభుత్వం.. మీ పోలీసు వ్యవస్థ.. జగన్పై జరిగిన దాడిని అడ్డుకోలేకపోయిందని చంద్రబాబును మాణిక్యాల రావు ప్రశ్నించారు. ఒకవేళ శివాజీ చెప్పిందే నిజమైతే దాడి మీ ఫెయిల్యూర్గా భావించి మీరు, హోంమంత్రి చినరాజప్ప రాజీనామా చేసి ప్రభుత్వాన్ని శివాజీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

శివాజీని విచారించేందుకు భయపడుతున్నారా?
ఇప్పటికైనా శివాజీని అరెస్ట్ చేసి ఆపరేషన్ గరుడ వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపించాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. ఒక వేళ ఆపరేషన్ గరుడపై విచారణ జరిపితే దీని వెనకున్న పెద్దలకు, మీ ప్రభుత్వానికి నష్టమని భయపడుతున్నారా? అని చంద్రబాబును మాణిక్యాలరావు నిలదీశారు.
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications