RRR జోస్యం, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందంటే?, ఆ పార్టీని ముంచేసిన ఓటర్లు, ఇదే నిజం!
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ పూర్తి అయ్యి రెండు రోజులు అవుతున్నా ఆ వేడి మాత్రం ఇంకా తగ్గడం లేదు. పలు చోట్ల అధికార వైసీపీకి చెందిన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచకపాలన అంతం అవుతోందని, ఆ రోజు నేను జైల్లో చేసిన శపథం నేరవేరుతోందని నరసాపురం ఎంపీ, ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘురామ కృష్ణరాజు జోస్యం చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని అమిరంలో మీడియాతో మాట్లాడిన నరసాపురం ఎంపీ రాఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుతవం మీద నిప్పులు చెలిగారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఇక ముందు వైసీపీ కనపడదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 150కి పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, అందులో ఎలాంటి అనుమానం లేదని రాఘురామ కృష్ణరాజు చెప్పారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయని, అయితే ఈసారి జగన్ ప్రభుత్వానికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో చుక్కలు చూపించారని రాఘురామ కృష్ణరాజు అన్నారు. ఎన్నికల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని, దేశ చరిత్రలో ఉద్యోగులు ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు వెయ్యడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు వైసీపీ అరాచాలకు చెక్ పెట్టాలని ఓటు వేశారని, ప్రజలు వైసీపీని ముంచేశారని రాఘురామ కృష్ణరాజు చెప్పారు.
గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తోందని, అందులో ఎలాంటి అనుమానం లేదని, ఓడిపోతామని తెలుసుకున్న వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, జగన్ చేస్తున్న మోసాలను ఆలస్యంగా తెలుసుకున్న మహిళలు పోలింగ్ రోజు వైసీపీ వ్యతిరేకంగా ఓట్లు వేసి నిరసన వ్యక్తం చేశారని రాఘురామ కృష్ణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో రాక్షసపాలన అంతం అవుతోందని, కూటమి ప్రభుత్వం కొలువుతీరుతుందని త్రిబుల్ ఆర్ ధీమా వ్యక్తం చేశారు.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications