చంద్రబాబును కాపాడింది జగనే ? ఇప్పుడు బుక్..! రఘురామ షాకింగ్..!
ఏపీ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతలు చంద్రబాబు, వైఎస్ జగన్. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు విపక్ష నేతగా ఉండేవారు, ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉంటే జగన్ విపక్ష నేత హోదా లేకపోయినా విపక్ష పార్టీలో ప్రత్యర్ధిగా ఉన్నారు. అయితే వీరిద్దరికీ సంబంధించిన ఓ విషయంలో ఓ లాజిక్ ఎలా వర్తిస్తుందో, గతంలో ఎలా వర్తించలేదో వివరించే క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జగన్ పై అసెంబ్లీకి రానందుకు అనర్హత వేటు వేసే విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు స్పందించారు. గతంలో చంద్రబాబు కూడా రెండేళ్ల పాటు అసెంబ్లీకి రాకుండా ఉండిపోయారని, అప్పట్లో ఆయనపై అనర్హత వేటు పడలేదని, ఇప్పుడు మాత్రం జగన్ కు అదే కారణంతో అనర్హత వేటు ఎలా వేస్తారని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో రఘురామ జవాబిచ్చారు.

ముందుగా జగన్ పై అనర్హత వేటు గురించి స్పందిస్తూ.. ఈసారి అసెంబ్లీ సమావేశాలు 20 రోజులు జరిగితే మాత్రం ఆయనపై వేటు పడటం ఖాయమని రఘురామ తేల్చేశారు. అయితే ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ జరుగుతుందన్న దానిపై జగన్ అనర్హత వేటు ఆధారపడి ఉందన్నారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకుండా మాట్లాడితే కుదరదని రఘురామ స్పష్టం చేశారు. రాబోయే సమావేశాల రోజులను బట్టి అనర్హత పరిధిలోకి వస్తారా లేదా అనేది నిర్ణయం ఉంటుందన్నారు.

మరోవైపు చంద్రబాబు గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆఖరి రెండేళ్లు సభకు రాలేదని కొంతమంది మాట్లాడటం సరికాదని రఘురామ తెలిపారు. అప్పట్లో చంద్రబాబు అసెంబ్లీకి రాకపోయినా అనర్హత వేటు ఎందుకు పడలేదో రఘురామ వెల్లడించారు. అప్పట్లో రెండేళ్ల పాటు చంద్రబాబు అసెంబ్లీకి రాలేదన్నది వాస్తవమే అయినా, ఆ సమయంలో అసెంబ్లీ 60 పనిదినాలు పని చేయలేదని, అందుకే ఆయనపై అనర్హత వేటు పడలేదని రఘురామ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు జగన్ విషయంలో అలా కాదన్నారు.
-
నితీశ్ తర్వాత వికెట్ చంద్రబాబే? మాజీ కేంద్రమంత్రి జోస్యం..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications