చంద్రబాబు కొంటున్నారు: 'పార్టీ మారే ఎమ్మెల్యేలు భిక్షగాళ్ల కంటే హీనులు'
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'పై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి తొలిసారిగా స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు. జూన్ నెలలో జరగనున్న రాజ్యసభ సీట్ల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.

ఎమ్మెల్యేలు వైసీపీని వీడటం వెనుక జగన్ ప్రమేయం కూడా ఉందని అన్నారు. జగన్ చేసిన ప్రకటన వల్లే ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని అన్నారు. జగన్ క్షమాణప కోరితే పార్టీని వీడిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలు భిక్షగాళ్ల కంటే హీనులని మండిపడ్డారు.
తిరుపతిలో భవనం కూలి ఒకరు మృతి
తిరుపతిలోని ఇసుకవీధిలో మూడంతస్తుల భవనం బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుని హారిక అనే యువతి మృతి చెందింది. మరో బాలిక గ్రీష్మ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వేలూరు సీఎంసీకి తరలించారు. డ్రైనేజీ కాలువ తవ్వుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు స్పందిస్తూ బాధితులను ఆదుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. వెంటనే అక్కడకు చేరుకున్న కలెక్టర్ సిద్ధార్థజైన్ ఘటనాస్థలిని పరిశీలించారు. మృతురాలి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమలదొడ్డి దగ్గర ఐఎంఎల్ మద్యం డిపోలో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 40 వేల కేసుల మద్యం సీసాలు, 11వేల బీర్ బాటిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రూ.24 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగిందని అంచనా వేశారు. షార్ట్ సర్య్కూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు అంటున్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications