ప్రత్యేక హోదా: వెంకయ్యకు రఘువీరా సవాల్, చర్చకు రెడీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి చెప్పారు. హోదాపై చర్చించేందుకు వెంకయ్యనాయుడి సవాల్ను స్వీకరిస్తున్నానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడికి చిత్తశుద్ది ఉంటే చర్చకు రావాలని రఘువీరా కోరారు. బహిరంగ చర్చకు తేదీనీ, వేదికను వెంకయ్య నాయుడే నిర్ణయించాలని ఆయన అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ రెండేళ్లలో అబద్ధాలు, ఆర్భాటాలతో పాలన సాగించిందని ఆయన విమర్శించారు.

ఎపికి ప్రత్యేక హోదా ఒక్కటే ఉంటే సరిపోదని వెంకయ్య నాయుడు మీడియాతో అన్నారు. ప్రత్యేక హోదా కన్నా కేంద్రం నుంచి ప్రత్యేక మద్దతు అవసరమని ఆయన అన్నారు. ఈ విషయంలో కాంగ్రెసు పార్టీది అనవసరమైన రాద్ధాంతమని ఆయన అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం ఉందని ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగినంత ఇవ్వకపోయినప్పటికీ ఏపీకి అధికంగానే ఇస్తున్నామని చెప్పారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన లెక్కలను చూపించాలన్నారు.












Click it and Unblock the Notifications