మోడీ, బాబులపై రఘువీరా ఫైర్, కరువుపై విఫలం
హైదరాబాద్: కరువు మండలాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 500 మండలాల్లో కరువు ఉందని జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు.
మండలాల్లో కరువు పరిస్ధితులపై ప్రభుత్వ శాఖలు కాకుండా జన్మభూమి కమిటీ ద్వారా సర్వే చేయించడం దారుణమని మండిపడ్డారు. పల్లెటూర్లకు వాటర్ సప్లై చేసే లెక్కల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు.

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు కేంద్రంపై పోరాడుతూనే ఉంటామని అన్నారు. రాబోయే రోజుల్లో కరువు మండలాల ప్రకటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింతగా ఒత్తడి పెంచనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications