తమ్ముడు వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు-అతన్ని కలుస్తా కానీ.. అంగీకరించలేను..
భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ సోదరుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై స్పందించారు. వరుణ్ పై అరుదుగా మాట్లాడే రాహుల్.. ఇవాళ పంజాబ్ లో జరుగుతున్న భారత్ జోడో యాత్ర విరామంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ ప్రశ్నకు స్పందించారు.
తన సోదరుడు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీతో సంబంధాలపై రాహుల్ గాంధీ ఇవాళ స్పందించారు. తమకు రెండు భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయని, తమ్ముడు స్వీకరించిన సిద్ధాంతాన్ని తాను అంగీకరించలేనని అన్నారు. తాను కావాలంటే వరుణ్ ను కలవగలను, కౌగిలించుకోగలను, కానీ నేను ఆ భావజాలాన్ని అంగీకరించలేన అని రాహుల్ తేల్చిచెప్పేశారు.

వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని, ఆయన భారత్ జోడో యాత్రలో నడిస్తే అది అతనికి సమస్య కావచ్చని రాహుల్ గాంధీ వెల్లడించారు. తన భావజాలం ఆయన భావజాలంతో సరిపోలడం లేదన్నారు. తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్ ) కార్యాలయానికి ఎప్పటికీ వెళ్ళలేనని రాహల్ తెలిపారు. అలా వెళ్లాల్సి వస్తే తన నరుక్కోవాల్సి వస్తుందన్నారు. తన కుటుంబానికి ఓ సిద్దాంతం ఉందని, ఏదో ఒక సమయంలో, ఇప్పుడు కూడా వరుణ్ దానికి భిన్నమైన దానికి స్వీకరించాడని, తాను ఆ భావజాలాన్ని అంగీకరించలేనని రాహల్ వెల్లడించారు.
#WATCH | Varun Gandhi is in BJP if he walks here then it might be a problem for him. My ideology doesn't match his ideology.I cannot go to RSS office,I'll have to be beheaded before that. My family has an ideology. Varun adopted another & I can't accept that ideology:Rahul Gandhi pic.twitter.com/hEgjpoqlhK
— ANI (@ANI) January 17, 2023
దేశంలోని సంస్థలపై ఆర్ఎస్ఎస్, భాజపా తీసుకొస్తున్న ఒత్తిడిపైనా రాహుల్ గాంధీ ఇవాళ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోని అన్ని సంస్థలను ఆర్ఎస్ఎస్, బీజేపీ నియంత్రిస్తున్నాయని, అన్ని సంస్థలపైనా ఒత్తిడి ఉందని ఆయన తెలిపారు. మీడియా ఒత్తిడిలో ఉందని, బ్యూరోక్రసీ ఒత్తిడిలో ఉందని, ఎన్నికల సంఘం కూడా ఒత్తిడిలో ఉందని, చివరికి వారు న్యాయవ్యవస్థపైనా ఒత్తిడి తెచ్చారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications