గవర్నర్తో భేటీ: పవర్స్పై కేంద్రానికి రాజీవ్ శర్మ లేఖ
రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఇతర రాష్ట్రాలతో వ్యవహరించే విధంగానే తెలంగాణ రాష్ట్రంలోనూ కేంద్ర వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయబోమని స్పష్టం చేశారు.
మంత్రి మండలి నిర్ణయాలకు అనుగుణంగానే గవర్నర్ నడుచుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ నియమ నిబంధనలకు లోబడే వ్యవహరిస్తోందని సీఎస్ లేఖలో అన్నారు. రాజీవ్ శర్మ శనివారంనాడు గవర్నర్ నరసింహన్తో కూడా సమావేశమయ్యారు. ఇదే విషయంపై ఆయన గవర్నర్తో మాట్లాడినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్ చేతికి అప్పగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారంనాడు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్టులా వ్యవహరిస్తుందని విమర్శించారు.