వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుణాల రీషెడ్యూల్ ఏపిలో 4జిల్లాలకే పరిమితం: ఆర్‌బిఐ

|
Google Oneindia TeluguNews

 RBI to reschedule loans only in four districts
న్యూఢిల్లీ/హైదరాబాద్: రుణాల రీషెడ్యూల్ విషయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత సానుకూలత చూపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు రుణాల రీషెడ్యూల్‌ను పరిమితం చేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు తెలిపింది. ఏపి ప్రభుత్వ అభ్యర్థన మేరకు నిరుడు భారీ వర్షాలు, ఫైలిన్ తుపానుల వల్ల నష్టపోయిన ఈ జిల్లాలకు మాత్రమే రుణాలు రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

సహకార, గ్రామీణ, వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన రుణాలకే ఈ వెసులుబాటు కల్పిస్తునట్లు స్పష్టం చేసింది. బంగారం తాకట్టు, అనుబంధ రంగాలపై రుణ రీషెడ్యూల్ కుదరని రిజర్వు బ్యాంక్ తేల్చి చెప్పింది. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరువు పరిస్థితి ఏమిలేదని.. రుణాలు రీషెడ్యూల్ చేయలేమని ప్రకటించిన విషయం తెలిసిందే.

రుణాల మాఫీ ఘనత మాదే: యనమల

రిజర్వు బ్యాంక్ నుంచి ఇబ్బందులు ఎదురైనా రుణాల మాఫీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

రూ. 45వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.

English summary
The Reserve Bank of India has formally given its approval for rescheduling of crop loans in four districts affected by heavy rains and Phailin cyclone in 2013 thus only partly conceding the request of Andhra Pradesh government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X