ఎర్రచందనం స్మగ్లింగ్: లారీ డ్రైవర్ కోట్లకు పడగలెత్తాడు
కడప: గత ఇరవై ఏళ్లుగా ఎర్రచందనా న్ని స్మగ్లింగ్ చేస్తూ వందల కోట్లకు పడగలెత్తిన ఓ లారీ డ్రైవర్ను కడప పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఇప్పటికే 500 టన్నులు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించిన డ్రైవర్ తిమ్మసముద్రం వెంకటరెడ్డి ఆస్తులు రూ.200 కోట్ల వరకు ఉంటాయని భావిస్తున్నారు.
అతడితో పాటు తమిళనాడుకు చెందిన మహమ్మద్ అలీ, కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన జంగాల వీరభద్రయ్య, చిట్వేలికి చెందిన కందుల రాజమోహన్రెడ్డి, వెంకటరెడ్డి సోదరుడి కుమారుడు చెంగల్రెడ్డిని కూడా సోమవారం అరెస్టు చేశారు. వీరంతా కూడా కోట్లకు పడగలెత్తి న స్మగ్లర్లే.

నాలుగు రాష్ట్రాలకు ఎర్రచందనాన్ని రవాణా చేస్తూ కార్యకలాపాలను విస్తరించారు. కడప ఎస్పీ నవీన్గులాఠీ వీరిని అరెస్టు చేసిన అనంతరం మీడియాకు ఆ వివరాలను అందించారు. కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేట బ్రిడ్జి సమీపంలో యాంటీ స్మగ్లింగ్ ప్రత్యేక దళం వీరిని అరెస్టు చేసింది.
వారి నుంచి 2.2 టన్నుల 171 దుం గలు స్వాధీనం చేసుకుని తెలంగాణాలోని మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగరం గోడౌన్లో నిల్వ వుంచిన 14 కిలోల ఎర్రచందనం పూసలు, మూడు కార్లు, ట్యాంకరు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని గోడౌన్ను సీజ్ చేశారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications