జాతీయరహదారిపై ఘోర ప్రమాదం: బీజేపీ నేతతోపాటు 9 మంది మృతి
అనంతపురం: జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై విడపనకల్ మండలం కొటాలపల్లి సమీపంలో ఇన్నోవా కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు.
మృతుల్లో ముగ్గురు బొమ్మనహళ్కు చెందినవారు కాగా, ఉరవకొండ మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముగ్గురు ఉన్నారు. మిగితా వారి వివరాలు తెలియాల్సి ఉంది. లారీ, కారు బలంగా ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జయింది. మృతులంతా దగ్గరి బంధువులు కావడంతో ఘటనాస్థలంలో రోదనలు మిన్నంటాయి.

ఘటనా స్థలం నుంచి మృతదేహాలను పోలీసులు ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా బళ్లారిలోని వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కోకా వెంకటప్ప మృతి చెందారు. వీరంతా ఆయన కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది.
ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ లారీ అధిక స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications