వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రివిలెజ్ కమిటీ భేటీకి రోజా డుమ్మా: మరోసారి కంటనీరు పెట్టిన అనిత

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శానససభ ప్రివిలెజ్ కమిటీ సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు రోజా గైర్హాజరయ్యారు. శనివారం సాయంత్రం ఈ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఇతర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కొడాలి నాని హాజరయ్యారు.

అనారోగ్యం కారణంగా రోజా సమావేశానికి హాజరు కాలేకపోతున్నారని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభా పక్షం కమిటికీ ఓ లేఖ రాసింది. తనను శాసనసభలోకి రానీయకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన రోజా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆమెను నిమ్స్‌కు తరలించారు. ఆమె బీపి, షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది.

Roja absent for Privilage Committee meeting

రోజాపై ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు అనిత కూడా హాజరయ్యారు. తనను రోజా అవమానించిన తీరుపై ఆమె కమిటీకి వివరించినట్లు సమాచారం. కమిటీకి విషయాలు చెప్పి ఆమె కంటనీరు పెట్టుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రులను అవమానించారని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఇదిలావుంటే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యె చెవిరెడ్డి భాస్కర రెడ్డి పరామర్సించారు.

English summary
YSR Congress party MLA Roja not able to attend Andhra Pradesh assembly Privilege committee meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X